శీతాకాలం ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో మన ఆరోగ్యం గురించి మనం ఎక్కువ శ్రద్ధ వహించాలి మరియు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఈ సంవత్సరంలో COVID-19 మహమ్మారి వలన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం గర్భిణీ స్త్రీలకు ప్రాధమిక సమస్యలలో ఒకటిగా మారింది. మీరు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అయితే , మీరు శీతాకాలంలో ఇంకొన్ని జాగ్రత్తలు అదనం తీసుకోవాలి.
పాలు, పండ్లు వంటి మంచి పోషకాహారం, చిరుధాన్యాలు మరియు సమతుల్య ఆహారం గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో తీసుకోవాలిసిన ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ రోజువారీ ఆహారంలో పాలు, పాల పదార్ధాలు, చిక్కుళ్ళు, పండ్లు వంటి వేర్వేరు ఆహారాలు ఉండేలా చూసుకోండి. రోగనిరోధక శక్తిని పెంపొందించే నారింజ, ఆపిల్, అరటి వంటి విటమిన్ సి ఉన్న పండ్లును తీసుకోవాలి. అలాగే, పాలకూర, కాలీఫ్లవర్ మరియు మరిన్ని కూరగాయల ఆకుకూరలు తీసుకుంటే శీతాకాలంలో మన ఆరోగ్యన్నీ చాలా తేలికగా కాపాడుకోవచ్చు.
మీ ఆహారంలో అయోడిన్ లేకపోవడం మీ శిశువు యొక్క మానసిక పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, గుడ్లు, సీఫుడ్, ఉప్పు మొదలైన అయోడిన్ కలిగిన పదార్ధాలను తీసుకోండి.
శీతాకాలంలో కూడా మీరు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. కాబట్టి, రోజూ మంచి నీరు ఎక్కువగా త్రాగండి. పండ్లు మరియు కూరగాయల తాజా రసాలు, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి కూడా తీసుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్య మలబద్ధకం. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ధాన్యాలు, పప్పులు, చిరుధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి అధిక ఫైబర్ను కలిగి ఉంటాయి.