Pregnant Women: అమ్మ పిలుపు కోసం ప్రతి ఆడబిడ్డ తపన పడుతుంది.. పండంటి బిడ్డ కోసం నవ మాసాలు మోస్తుంది.. పురిటి నొప్పుల భరిస్తుంది.. గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం ఆహారాలు తినాలి..!? ఏం తినకూడదో..!? ఇప్పుడు తెలుసుకుందాం..!!
రెండు, మూడు నెలలు గర్భవతులు గా ఉన్నప్పుడు ఎక్కువగా వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అంటే ఆవ పిండి, ఆవకాయ, పిప్పళ్లు, మిరియాలు, శొంఠి, నువ్వులు, ఇంగువ, లవంగాలు, ఎక్కువ కారం, ఉప్పు, కాకరకాయ, కర్భూజ, వెల్లుల్లి, వస వేసిన పదార్థాలు తినకూడదు. నువ్వుల చేసిన చిమిడి ఉండలు, నువ్వుల ఉండలు తినకూడదు. రెండు నుంచి నాలుగు నెలల లోపు వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగితే గర్భ స్రావం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు. కాటన్, వదులైన దుస్తులను ధరించాలి. 6 వ నెల నుంచి సంభోగంలో పాల్గొనకుడదు. సంభోగంలో పాల్గొంటే గర్భ స్రావం, 8 మాసాలకే ప్రసవం, మృత శిశువు పుట్టడం జరుగుతుంది.
ఎక్కువగా ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణం కాదు. బయట దొరికే చిరుతిళ్లు జోలికి వెళ్లకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంటి భోజనం తినాలి. కాస్తైనా శారీరక శ్రమ చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనసులో ఈర్ష, ద్వేషం, అసూయ, రజో తమో గుణాలకు లోనవకుడదు. అలా గురికావడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. పుట్టే బిడ్డ అవే లక్షణాలతో జన్మిస్తారు. మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?