ఈ రోజున భారత దేశ ప్రజలంతా సూర్యగ్రహణం వీక్షించేందుకు రెడీ అయిపోయారు. మన దేశంలో మొదటిగా రాజస్థాన్ లోని భుజ్ అనే నగరంలో ఉదయం 10 గంటలకు సూర్య గ్రహణం మొదలవుతుంది. ఈ గ్రహణం నాలుగు గంటల వరకు ఉండి అస్సాంలో ముగుస్తుంది.
ఇదిలా ఉండగా సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వాటి వల్ల మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి వాటిలో చాలావరకు ప్రాణాంతకమైన ముప్పుకు దారితీస్తాయి. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు సూర్యగ్రహణం వీక్షించేటప్పుడు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలను సూచించింది.
- ముందుగా ఎవరూ కూడా నేరుగా తమ కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా సూర్య గ్రహణం సమయం లో సూర్యుడు ని వీక్షించడానికి ప్రయత్నించకూడదు అని ప్రభుత్వం సూచించింది.
- అలాగే సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్, గాగుల్స్ మరియు వాడేసిన ఎక్స్రే వంటివి అస్సలు వాడొద్దని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఇకపోతే నీటిలో సూర్య గ్రహణం సమయం లో సూర్యుడి ప్రతిబింబాన్ని కూడా చూడొద్దని గట్టిగా ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వం హెచ్చరించారు.
- ఇక గర్భిణీలు మరియు బాలింతలు ఇంటిలోనే ఉండి టీవీలను లేదా ఆన్లైన్ సైట్ లోనూ సూర్యగ్రహణాన్ని వీక్షించడం మంచిదని సలహా.
- అలాగే సాధ్యమైనంత వరకు గ్రహణం సమయంలో లైట్ కలర్ దుస్తులను వేసుకోవడాం మంచిది.
ఈ సూర్యగ్రహణం పోతే మరొక రెండు సంవత్సరాల్లో మరొక సూర్యగ్రహణం వస్తుంది కానీ అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని వారు ఈ సలహాలు మరియు సూచనలు ఇస్తున్నారు.