Nimmagadda Ramesh Kumar : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda Ramesh Kumar తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అవుతున్న సంగతి. చాలావరకు నిమ్మగడ్డ నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నట్లు వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు పరిశీలకులు కూడా అదే రీతిలో చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఒకపక్క చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ కి లెటర్లు రాస్తూనే మరోపక్క గవర్నర్ కి కూడా లెటర్లు నిమ్మగడ్డ ఇటీవల రాయడం వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితి కి దారి తీసింది. ముఖ్యంగా నిమ్మగడ్డ రాసిన లేఖలో మంత్రులు బొత్స అదేవిధంగా పెద్దిరెడ్డి తో పాటు మరి కొంత మంది పై ఫిర్యాదు చేసే రీతిలో హద్దులు దాటుతున్నారు అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకుని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రివిలేజ్ కమిటీ నివేదిక బట్టి ఖచ్చితంగా నిమ్మగడ్డ SEC చైర్ కి ఎసరు గ్యారెంటీ అనే టాక్ పరిశీలకుల నుండి వినబడుతోంది. ఆయన తీసుకుంటున్న ప్రతిచర్య, నిర్ణయాలు కూడా బీచ్ ఆఫ్ ప్రీవిలేజెస్ లెక్క కింద వస్తుందని అంటున్నారు.
ఏకగ్రీవాలు రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ అనటం అసలు ఏ ప్రొవిజన్ కింద వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగానే 2008వ సంవత్సరంలో మహారాష్ట్రలో స్టేట్ ఎన్నికల కమిషనర్..అన్నీ తానై వ్యవహరిస్తే, ప్రభుత్వం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తే మహారాష్ట్ర స్టేట్ ఎన్నికల కమిషనర్ దానిపై కనీసం సంతకం కూడా పెట్టలేదని, దాంతో ప్రభుత్వం కోర్టుకు వెళితే సదరు ఎన్నికల కమిషనర్ కి ముంబై హైకోర్టు అరెస్టు వారెంటు జారీ చేసినట్లు పరిశీలకులు తెలిపారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ కావటంతో, ఆ రాజ్యాంగ వ్యవస్థ కి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు కి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు చేయటంతో..నివేదిక ప్రకారం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అసెంబ్లీ స్పీకర్ ఆయన పదవి స్థానం.. ఊడిపోయేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలపై.. ఎలాగో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో… ప్రివిలేజ్ కమిటీ పేరిట మరికొద్ది గంటల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత నిమ్మగడ్డ.. SEC చైర్ కి ఎసరు గ్యారెంటీ అని, ఉడిపోతుంది అనే టాక్ బలంగా మీడియా సర్కిల్స్ లో వస్తోంది.