ఇటీవల మిజోరాం రాష్ట్రానికి చెందిన నాలుగు సంవత్సరాల బాలిక అయినా ఎస్తేర్ …. వందేమాతరం గేయాన్ని ఆలపించడం జరిగింది. మృదుమధురంగా ఎస్తేర్ ఆలపించిన ఈ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. చాలా మంది ప్రముఖులు ఎస్తేర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్విట్టర్లో స్పందించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్వీట్ చేసిన ఈ బాలిక వీడియోను మోడీ శనివారం రీట్వీట్ చేశారు. ఎస్తేర్ హ్నమ్టే జాతీయ పతాకాన్ని పట్టుకొని‘ వందేమాతరం’ గీతాన్ని ఆలపించిన ఈ వీడియోని జోరమ్ తంగా ట్వీట్ చేశారు.‘ అమ్మా నీకు వందనం అంటూ మిజోరాం పాడుతోంది. వందేమాతరం’ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోడీ కూడా ఎస్తేర్ హ్నమ్టే పాడిన విధానానికి ముగ్ధులు అయ్యారు. అంతమాత్రమే కాకుండా చాలా గౌరవప్రదంగా సాంప్రదాయబద్ధంగా పాట బాగుంది, ఎస్తేర్ హ్నమ్టే నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటూ ట్విట్టర్లో మోడీ స్పందించి రీ ట్వీట్ చేశారు. ‘ఎస్తేర్ హ్నమ్టే ప్రదర్శన అద్భుతం. అభిమానించదగినది’ అంటూ కొనియాడారు. నాలుగేళ్ల చిన్నారి అయినా ఎస్తేర్ హ్నమ్టే పాడిన వందేమాతరం పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
భారత దేశ వ్యాప్తంగా అతి చిన్న వయసులోనే ఎస్తేర్ పేరు మారుమ్రోగుతోంది. పాటకు తగ్గ వీడియో చిత్రీకరించిన విధానం కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో నార్మల్ రెడ్డి జనులు కూడా సోషల్ మీడియాలో ఎస్తేర్ హ్నమ్టే పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉన్నది అంటూ ఆల్దిబెస్ట్ చెబుతున్నారు.