కొన్ని వార్తలను చదివితే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఆ వార్తను మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని ఏళ్లైనా అలాంటి వార్తలు మనకు గుర్తుకు ఉంటాయి. అలాంటిదే ఈ న్యూస్.. అతను ఒక హంతకుడు.. జైలు పాలైనాడు.. అయినా అతనిలో మార్పులు రాలే.. ఖైదీలనే చంపడం మొదలు పెట్టాడు. ఏకంగా 48 మందిని చంపేశాడు. ఇంకా చంపుతానని జడ్జి ముందే చెప్పాడు. ఇలా చంపడం తప్పుగా అనిపించడం లేదని ఆ ఖైదీ చెబుతున్నాడు.
జైలు సిబ్బందిని సైతం వణికిస్తున్న ఈ ఖైదీ పేరు మార్కోస్ పౌలో దా సిల్వా. సీరియల్ హత్యలు చేశాడు. దాంతో అంతా లుసీఫర్ అని పిలవడం ప్రారంభించారు. 18 ఏళ్ల వయస్సులో చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికాడు. అలా జైల్లో అడుగుపెట్టిన అతడికి ఏమైందో తెలియదు కానీ.. తోటి ఖైదీలను చంపేస్తూ జైల్లోనే శిక్షల మీద శిక్షలను అనుభవిస్తూ వస్తున్నాడు. 1995లో జైల్లో అడుగు పెట్టిన ఇతను మళ్లీ బయట అడుగుపెట్టలేదు. 2011లో బ్రెజిల్లోని సావో పాలో జైల్లో ఒకేసారి ఐదుగురి ఖైదీలను చంపేసి వార్తల్లోకి ఎక్కాడు.
లుసీఫర్కు ఇప్పటివరకు పడిన జైలు శిక్షల మొత్తం 217 ఏళ్లు. ఇవి కాకుండా మరిన్ని హత్య కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. ఇటీవల ఒక కేసు విచారణలో భాగంగా లుసీఫర్ జడ్జితో చెప్పిన మాటలు వింటే భయం వేస్తుంది. అంతమందిని చంపినందుకు నాకు ఎలాంటి పశ్చాతాపం కలగటం లేదు. నేను చంపింది రేపిస్టులు, దొంగలు. ఇతర ఖైదీలను దోచుకొనేవారే. వారు చేస్తున్న పనులను సంహించలేకే చంపేశానని చెప్పాడు.లుసీఫర్ చేసిన హత్యల వివరాలు ఇప్పటివరకూ బయట ప్రపంచానికి తెలియదు. ఈ మధ్యే దక్షిణ అమెరికాకు చెందిన యూఓఎల్ అనే మీడియా సంస్థ లుసీఫర్ నేరాల వివరాలను బయట పెట్టింది.
ఇతను చేస్తున్న హత్యలతో లుసీఫర్ను తిప్పని జైలంటూ లేదు. ఏ జైలుకు తీసుకుపోయినా.. బేడిలు వేసి కట్టేసినా హత్యలు చేయడం మాత్రం ఆపేవాడు కాదు. మంచిగా నటిస్తూ.. జైలు సిబ్బందని మభ్య పెడుతూ హత్యలను చేస్తూ వచ్చాడు. సెర్రా అజుల్ జైల్లో అయితే మంటలను ఆర్పే సిలిండర్తో ఖైదీల తలలను పగలగొట్టాడు. జైల్లో ఉండే కత్తితో తలలను మొండెం నుంచి వేరు చేసేవాడు.