Breaking: పుష్ప – 2 చిత్ర బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. పుష్ప – 2 ఆర్టిస్టులతో వెళుతున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్ పల్లి సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును పుష్ప – 2 ఆర్టిస్టులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లీయర్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ప్రమాదం గురింతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!