Priyamani: పెళ్ళి తర్వాత సిల్వర్ స్క్రీన్కి దూరమయ్యే హీరోయిన్స్లో జాతీయ అవార్డ్ అందుకున్న ప్రియమణి కూడా చేరుతుందని అందరూ అనుకున్నారు. తమిళంలో పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకొని ఒక్కసారిగా సౌత్లో స్టార్ స్టేటస్ అందుకున్న ప్రియమణి తెలుగులో నటించిన మొదటి సినిమా ఎవరే అతగాడు. ఈ సినిమా ఫ్లాప్గా మిగిలింది. అయినా మళ్ళీ జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళైన కొత్తలో అనే సినిమాలో అవకాశం అందుకొని తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారింది.
అయితే మొదటి సినిమా జగపతి బాబు లాంటి సీనియర్ హిరోతో చేసింది కాబట్టి ఇక అన్నీ అలాంటి సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలే దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ నితిన్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించే అవకాశాలు అందుకుంది. నవ వసతం అనే సినిమాలో తరుణ్ సరసన, ద్రోణ సినిమాలో నితిన్ సరసన నటించి ఆకట్టుకుంది. అంతేకాదు కథకి అవసరం అని దర్శకుడు సూచించగానే మారు మాట్లాడకుండా బికినీలో కనిపించడానికి ఓకే చెప్పింది. అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ కాబట్టి హీరోయిన్గా మంచి సినిమాలు చేసింది.
Priyamani: ప్రియమణి ఇక సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చేసినట్టే అనుకున్నారు.
తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా హిందీతో పాటు మిగతా సౌత్ భాషాలో కూడా ప్రియమణి క్రేజీ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. అయితే ముస్తఫా రాజ్ని పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రియమణి చిన్న గ్యాప్ తీసుకుంది. దాంతో అమ్మడు ఇక సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చేసినట్టే అనుకున్నారు. మళ్ళీ ఎప్పటికో గానీ అమ్మ, అత్త పాత్రల్లో కనిపిస్తుందని అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ గ్రాండ్గా ఇచ్చి ప్రేక్షకులకు షాకిచ్చింది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్స్ లో నటించిన ప్రియమణి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇక తెలుగులో వెంకటేశ్ సరసన తమిళ హిట్ సినిమా అసురన్ రీమేక్ నారప్పలో నటించే అవకాశం అందుకుంది. అది కూడా హీరోయిన్గా. అలాగే రానా – సాయి పల్లవి నటిస్తున్న విరాట పర్వం సినిమాలో కూడా నక్సలైట్ భారతక్క పాత్రలో నటిస్తోంది. ఇలా తెలుగులో ఒకేసారి రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడంతో మేకర్స్ ప్రియమణికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రియమణి తరగని గ్లామర్తో అందచందాలతో ఆకట్టుకుంటోంది. సీనియర్ స్టార్ హీరోలతో పాటు గోపీచంద్ లాంటి మాస్ హీరోలకి మంచి ఛాయిస్గా మారింది.
Priyamani: పెళ్ళి తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుందనుకున్న ప్రియమణి
అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ తర్వాత ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్లో నటించే అవకాశం అందుకుంది ప్రియమణి. ఈ సినిమా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ – అట్లీ కుమార్ కాంబినేషన్లో రూపొంతున్న భారీ బడ్జెట్ సినిమా. ఇందులో నయనతార, ప్రియమణి హీరోయిన్గా నటిస్తున్నారు. షారుఖ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్తో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి పెళ్ళి తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుందనుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్లో తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ షాకులిస్తోంది.