Priyamani : పరుత్తి వీరన్ అనే సినిమాతో ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకుంది ప్రియమణి. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే కెరీర్ మంచి జోరుమీదుండగానే పెళ్ళి చేసుకున్నారు. ముస్తఫా రాజ్ తో పెళ్ళయ్యాక సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో బుల్లితెర మీద సందడి చేస్తున్న ఈమె చాలా కాలానికి వెంకటేశ్ నటిస్తున్న చిన నారప్ప సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా థియేటర్స్ క్లోజ్ ఉండటంతో నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాతలకి ఇంతకంటే ఆప్షన్ దొరకడం లేదు.
ఇప్పటికే నారప్ప ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర హీరోయిన్ ప్రియమణి మాట్లాడారు. నారప్ప సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. కోలీవుడ్ లో అసురన్ గా విడుదలైన తమిళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టింది. దాంతో ఈ సినిమాను తెలుగులో నారప్పగా నిర్మించారు. ఇక తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నారు. పెళ్ళి వయసుకు వచ్చిన అబ్బాయికి తల్లిగా నటించటం అంటే ఛాలెంజింగ్ రోల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Priyamani : ప్రియమణి గ్లామర్ కి ఇలాంటి రోల్ అంటే అభిమానులు హర్ట్ అయ్యే విషయమే.
ప్రియమణి గ్లామర్ కి ఇలాంటి రోల్ అంటే అభిమానులు హర్ట్ అయ్యే విషయమే. అయినా ప్రియమణి పెద్ద సాహసం చేసింది. అంతేకాదు నారప్ప సినిమాలో అనంతపురం జిల్లా యాసలో ప్రియమణి మాట్లాడుతుందని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో అర్థమైంది. ఇక ఇందులో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటంతో పాటు, ఆ యాసలో మాట్లాడటానికి చాలా కష్టపడినట్టు తెలిపింది. కాగా నారప్ప సినిమా ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. చిత్ర బృందానికి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి వచ్చే రెస్పాన్స్ ను బట్టి మరికొన్ని పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతాయంటున్నారు