ప్రియాంక అరుల్ మోహన్.. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ పేరు. ఈ బ్యూటీ నాని హీరోయిన్. అంటే ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్. ఈ సినిమాకి విక్రం కుమార్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ కాలేదు. కాని ప్రియాంక మాత్రం ప్రేక్షకులని.. ఇండస్ట్రీ వర్గాలని బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా రిలీజవగానే యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
వాస్తవంగా కరోనా లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే ఈ పాటికే ప్రియాంక టాలీవుడ్ లో గట్టిగానే పోటీ ఇచ్చేది. కాని తన రెండవ సినిమా రిలీజ్ కాకుండా బ్రేక్ పడే సరికి నిన్నా మొన్నటి వరకు ఎవరికి అంతగా తెలియకుండా అయిపోయింది. ఆయితే ఎప్పుడైతే శ్రీకారం సినిమా నుంచి పెంచల్ దాస్ రాసి పాడిన సంగ్ రిలీజైందో ఒక్క దెబ్బకే ప్రియాంక మీద అందరి దృష్టి పడింది. ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన్నా ఇంతకముందు కథనుబట్టి కథలో ఉన్న పాత్రలను బట్టి ఏ హీరో హీరోయిన్ సరిపారో వాళ్ళనే ఎంచుకునే వారు.
తర్వాత పరిస్థితులు మారిపోయాయి. స్టార్ హీరోల డేట్స్ ని బట్టి కథలు తయారవుతున్నాయి. ఆ తర్వాత బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నారు. జనాలలో ఎక్కువగా ఏ హీరోయిన్ కి క్రేజ్ ఉందో ఆ హీరోయిన్ నే భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తమ సినిమాలలో నటింప చేస్తున్నారు. అంతేకాదు హీరోయిన్ ని ఎంత గ్లామర్ గా చూపిస్తే జనాలు అంతగా థియోటర్స్ కి వస్తారన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు తయారయ్యాయి. అందుకే మేకర్స్ కూడా దానికే ఇంపార్ట్న్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ అలాగే ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ‘శ్రీకారం’ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, లిరికల్ వీడియో సాంగ్స్ తో ప్రియాంక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. శర్వా శ్రీకారం తర్వాత నాగ చైతన్య తో థ్యాంక్యూ అన్న సినిమా చేయబోతున్నట్టు సమాచారం. మొత్తంగా శ్రీకారం సినిమా నుంచి రిలీజైన సాంగ్ లో గ్లామరస్ గా కనిపించి యూత్ కి చమటలు పట్టించడమే కాదు కొత్త సంవత్సరంలో వరస అవకాశాలతో హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?