smart phone: ఉదయాన్నే లేవగానే మొదటిగా సెల్ ఫోన్ లో అప్డేట్ స్ చూసుకోవడమే మొదట పని గా ఉంటుంది చాలా మందికి. రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాటికి ఎన్ని లైకులు వచ్చాయి? ఎంత మంది కామెంట్లు పెట్టారు ?ఎవరైనా కొత్త అప్డేట్ స్ పెట్టారా?వాటిల్లో వేటికి లైక్ కొట్టాలి ? అని గంటల తరబడి అక్కడ టైం స్పెండ్ చేయడం తో నే రోజు ప్రారంభిస్తారు.
స్మార్ట్ ఫోన్లో సంగతులకోసం ఆత్రుత ఎక్కువగా ఉండి ఎప్పుడు ఖాళీ ఉన్నా,ఇంకా చెప్పాలంటే బాత్రూం లో కూడా ఫోన్ వదలకుండా ఆ సంగతుల్లోనే మునిగి పోతారు. చివరికి సోషల్ మీడియా కబుర్లతోనే మధ్యరాత్రి వరకూ సమయం గడిచిపోతుంది.అసలు అన్నం తింటున్న,ఒక్క నిమిషం ఖాళీగా ఉన్న ఫోన్లోనే గడిపేస్తున్నారు. ఇలాంటి జీవితానికి అలవాటుపడివారిలో ఎలాంటి సమస్యలువస్తాయో కొత్తగా జరిపిన ఒక అధ్యయనం కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉండేవారికి నిద్ర సమయంలో సమస్యలు వేధిస్తున్నాయి అని ఈ అధ్యయనంలో బయట పడింది. దీనితో పాటు 20 శాతం మంది నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నారట.
దీనికికారణం వారు `ఏదో కోల్పోతున్న భావన`లో ఉండటం వల్ల ఇలా జరుగుతుందని అధ్యయనం వివరిస్తోంది. ఈ పరిశోధనలో సాధరణ స్మార్ట్ ఫోన్లు వాడేవారిలో, యాప్లు ఏమీ లేకుండా ఉండే బేసిక్ మోడల్ ఫోన్లువాడేవారిలో ప్రవర్తన లో ఎలాంటి తేడా ఉంటుందో పరిశోధన చేశారు. ఎక్కువ సమయాన్నిసోషల్ మీడియాలో గడుపుతున్నవారు తరచుగా పళ్లు కొరకడం, నిద్ర మధ్యలో లేచి కూర్చోవడం చేస్తున్నారని ఈ అధ్యయనంలో బయట పడింది