C. Kalyan: ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు అదే రీతిలో సినిమా డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల యాజమాన్యాలు ఏపీ మంత్రి పేర్ని నాని తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలు అదేరీతిలో.. 12 గంటల్లో నాలుగు షోలు.. ఇంకా కరెంట్ బిల్స్ ఇంకా అనేక విషయాల పై సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి .. అదే రీతిలో ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ గురించి చర్చించారు. చర్చల అనంతరం మీడియాతో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడటం జరిగింది.
ఆన్ లైన్ టికెట్ విధానం ప్రభుత్వాన్ని అడిగింది తామే అని స్పష్టం చేశారు. ఇంకా థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ.. బెనిఫిట్ షో గురించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదే తరుణంలో నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ టికెట్ విధానం వలన సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించాలని కోరినట్లు తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించి అన్ని సమస్యలు గురించి చర్చించినట్లు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సానుకూలంగా స్పందించినట్లు సమావేశం అనంతరం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొంతమంది ఫేక్ కలెక్షన్ లు.. ప్రకటిస్తారని వందల కోట్లు వసూలు చేసినట్లు పేపర్లలో ప్రకటనలు వేసుకుంటారని అవి కేవలం ప్రజలను మోసం చేయడానికి .. ఆ రీతిగా ఇండస్ట్రీలో కొంత మంది వ్యవహరిస్తారని తెలిపారు. మా అభిమాన హీరో సినిమా చూడకపోతే కలెక్షన్లు తగ్గిపోతాయి ఏమో అన్న భావన కలిగించడానికి ఆ విధమైన ప్రకటనలు ఇస్తూ ఉంటారని తెలిపారు. దీంతో సీ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఇదిలా ఉంటె ఇటీవల ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానం తీసుకొచ్చినట్లు… జీవో కూడా విడుదల చేసినట్లు వార్తలు వచ్చిన టైంలో పలు ఇండస్ట్రీకి చెందిన హీరోలు.. నిర్మాతలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. కాగా తాజాగా ఆన్లైన్ టికెట్ విధానాన్ని.. టాలీవుడ్ పెద్దలే కోరినట్లు నిర్మాత సి.కల్యాణ్ తాజాగా తెలపటంతో.. ఆన్లైన్ టికెట్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. త్వరలోనే సీఎం జగన్ తో కూడా భేటీ కాబోతున్నట్లు నిర్మాతలు చెప్పుకొచ్చారు.