టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చిన సినిమా షూటింగులు మొదలు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి దేశంలో నెలకొంది. కారణం చూస్తే కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ దేశంలో తీవ్రంగా మారింది. రోజుకి పది వేల కొత్త కేసులు నమోదు కావడంతో కేంద్రంలో కూడా టెన్షన్ మొదలయింది. దీంతో ప్రధాని మోడీ మరొకసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు మాత్రం నాలుగు నెలలపాటు కనీసం సినిమా షూటింగ్ గాని సినిమా రిలీజ్ గాని ఏది పెట్టుకో కూడదు అని డిసైడ్ అయ్యారట.
ప్రస్తుతం సురేష్ తన బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘నారప్ప’ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయి సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా అప్పుడే స్టార్ట్ చేయకూడదని…మిగతా సినిమాల షూటింగ్స్ అప్పుడే సెట్స్ పైకి వెళ్లకూడదని సినిమా యూనిట్ కి తేల్చి చెప్పారట. వైరస్ ప్రభావం తగ్గేవరకు నో షూటింగ్, నో రిలీజ్ అని సురేష్ బాబు అంటున్నారట. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరు ఏం మాట్లాడ వద్దు అని కమర్షియల్ గా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో సురేష్ బాబు నిర్ణయాలు తీసుకోవడంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క దగ్గుబాటి రానా వివాహం ఆగస్టు నెలలో ఉండే అవకాశాలు ఉండటంతో మొత్తం ఆలోచించి సురేష్ బాబు ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, సినిమాలు ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై క్లారిటీ తో ఉన్నట్లు సమాచారం.