Sarkaru vaari paata: మహేశ్ అభిమానులకు నిర్మాతలు పెద్ద షాకే ఇచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. మహేశ్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణను ఈ సినిమా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్నీ సాంగ్స్ కంపోజ్ చేయడం కూడా పూర్తైంది.
ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన టీజర్ వచ్చి భారీ స్థాయిలో అంచనాలు కలిగించింది. కేవలం మహేశ్ అభిమనుల్లో మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరిలోనూ సర్కారు వారి పాట సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. ఇక థమన్ మ్యూజిక్ మరో రేంజ్ అంటూ ఇప్పటికే అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక థమన్ కూడా ఈ మధ్య వరుసగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ట్వీట్ ద్వారా ఇచ్చి బాగానే సర్ప్రైజ్ చేశారు. ఇంత హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారు.
Sarkaru vaari paata: ఖుషీ చేస్తాయనే ఆశలు పెట్టుకోకూడదని నేరుగానే చెప్పారు.
అసలే భారీ స్థాయిలో సంక్రాంతి రేస్లో వస్తుందని మహేశ్ బృందం చెప్పి మళ్ళీ తపుకుంటున్నట్టు చెప్పి డిసప్పాయింట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల సర్కారు వారి పాటను పోస్ట్పోన్ చేశారు. ఇదే నిరుత్సాహంలో ఉంటే కనీసం అప్పుడప్పుడు ఓ సర్ప్రజింగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ను ఖుషీ చేస్తారనుకుంటే ఇప్పట్లో సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ రావని స్వయంగా నిర్మాతలే వెల్లడించారు. ఓ అభిమాని అప్డేట్స్ అడిగితే మేకర్స్ ఇచ్చిన ఆన్సర్ షాకిచ్చింది. దాంతో ఇక ఈ సినిమా నుంచి ఏ అప్డేట్స్ వచ్చి అభిమానులను ఖుషీ చేస్తాయనే ఆశలు పెట్టుకోకూడదని నేరుగానే చెప్పారు. ఇక ఏప్రిల్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అత్యంత భారీ కుంభ కోణం నేపథ్యంలో డైరెక్టర్ పరశు రామ్ పెట్లా తెరకెక్కిస్తున్నాడు.