ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి అతి తక్కువ టైమ్ లోనే ఫేమస్ అయినా యాప్ టిక్ టాక్. చాలామంది ఈ టిక్ టాక్ యాప్ వలన అతి తక్కువ టైమ్ లోనే పాపులర్ అయ్యారు. ఇండియాలో ఈ యాప్ చాలా ఆదరణ దక్కించుకుంది. అటువంటి ఈ యాప్ ని నిషేధించింది భరత్ ప్రభుత్వం. జూన్ 15వ తారీకు చైనా ఇండియా బోర్డర్ వద్ద ఇరు దేశాల సైనికులు మధ్య గొడవ జరగడంతో… చైనా దూకుడుకి కళ్ళెం వేస్తూ అప్పట్లో ఈ యాప్ ని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది అని భావించారు.
ఒక ఇండియా మాత్రమే కాదు అమెరికా కూడా టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించడం జరిగింది. కానీ అసలు కారణం చూస్తే టిక్ టాక్ యాప్ వల్ల భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయట. ఈ యాప్ వాడే ప్రతి ఒక్కరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చైనాకి చేరుతుందని, అటువంటి టెక్నాలజీతో ఈ యాప్ చైనా ప్రపంచంపై వదిలినట్లు బయటపడింది.
ఇందువలన ఇండియా మరియు అమెరికా ఇంకా పలు దేశాలు ఈ యాప్ పై నిషేధం విధించడం జరిగింది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే ఈ యాప్ కి ఒక వారానికి కోట్లు మీద కోట్లు వస్తాయి. రోజుకి లక్షల్లో చాలామంది ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవటంతో పాటు యాడ్స్ వల్ల కూడా రెవెన్యూ బిలియన్ డాలర్లలో టిక్ టాక్ సంపాదిస్తుంది. ఈ విధంగా కోట్లు కుమ్మరించే టిక్ టాక్ యాప్ ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఆ సంస్థ ధ్రువీకరించింది.
ఈ సందర్భంగా టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ తో ఒప్పందం ఒక కొలిక్కి రావటానికి ఇంకా రెండు నెలలు పట్టే సమయం ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా భద్రతా పరమైన విషయంలో టిక్ టాక్ యాప్ లో ఉండే డేటా మొత్తం సర్వర్ ల ద్వారా డిలీట్ చేసి… యూజర్లకు సరికొత్త భద్రత కల్పించే రీతిలో అందించే ఆలోచన మైక్రోసాఫ్ట్ కంపెనీ చేయబోతున్నట్లు తన బ్లాగులో తెలిపింది. బైట్ డాన్స్ తో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు చాలావరకు సానుకూలంగా ఉండటం తో యాప్ మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంటే అమెరికా ఖజానా కి భారీ స్థాయిలో లాభం రావటం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది.