తన కంటే వయసుల్లో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకున్న యువకుడు తమ పెళ్లి ఫోటోలు బంధువులకు షేర్ చేసిందని భార్యను హత్య చేశాడు.పెళ్లి ఫొటోలు షేర్ చేస్తే హత్య ఎందుకు చేశాడని అనుమానం వచ్చిందా!ఇక్కడే అసలు విషయం ఉందండీ!అదేమిటంటే ఆ భర్త వయసు ఇరవై ఎనిమిదేళ్ళు, భార్య వయసు యాభై ఒక్క సంవత్సరాలు.మళ్లీ ఇదేంటి అంటారా?అయితే ఈ వార్త పూర్తిగా చదవండి!!
కేరళలోని కరక్కోణం ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే అరుణ్ కుమార్(28), తన తల్లి స్నేహితురాలైన శాఖా కుమారితో(51) డేటింగ్ చేశాడు. కొన్నాళ్లు తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలను కున్నారు. అక్టోబర్ 19న కొద్దిమంది సమక్షంలో ఆమె మెడలో తాళికట్టాడు.
ఆస్తి కోసం అలిని చేసుకున్నాడు!
దాదాపు 23 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్న మహిళను కేవలం ఆస్తి కోసం కుమార్ పెళ్లి చేసుకున్నాడు.శాఖా కుమారి మంచి స్ధితిపరురాలు. ఆర్ధికంగా బాగా ఎదిగిన కుటుంబం. ఒంటరి మహిళ. ఆమెకు త్రెస్యాపురంలో ఎకరాల కొద్దీ భూమి ఉంది. బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు ఉన్నాయి. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం. నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం వస్తుంది. కావాల్సినంత సంపద ఉన్నా ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. ఆమెకు జీవితంలో ఒక తోడు కావాలి. దాని కారణంగా ఆమె అరుణ్ కుమార్ ను ఇష్టపడింది. ఆమె అవసరాన్ని అరుణ్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.వివాహ సమయంలో పది లక్షల రూపాయల నగదు, కారు కూడా బహుమతులుగా పొందాడు.భవిష్యత్తులో ఆమె ఆస్తి మొత్తం కొట్టేయెచ్చని సంబరపడ్డాడు.కానీ…. తమ పెళ్లి విషయం సమాజంలో గుట్టుగా ఉంచాలని భావించాడు.
ఆమె చేసిన నేరం ఏమిటంటే ?
అరుణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కుమారి ఎంతో సంతోషంగా తన బంధువులకు విషయం చెప్పి పెళ్లి ఫొటోను షేర్ చేసింది.ఈవిషయం అరుణ్ కుమార్ కు తెలిసింది. పెళ్లి ఫోటోలు ఇతరులకు పంపించవద్దని భార్యతో చెప్పాడు. అయినా ఆమె తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోటానికి ఫోటోలు షేర్ చేసేది. దీంతో అరుణ్ కు కోపం వచ్చింది. తన పెళ్లి బయట సమాజానికి తెలియటం అతనికి ఇష్టం లేదు. శనివారం నాడు ఈవిషయమై ఇద్దరి మధ్య గొడవ జరగింది. కోపం పట్టలేని అరుణ్ ఆమెకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. విద్యుద్ఘాతంతో ఆమె మరణించినట్లు కుమార్ చిత్రీకరించాలని చూసినప్పటికీ కుదరలేదు చివరికి కటకటాల పాలయ్యాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?