NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

మోదికి ‘పౌరసత్వం’ సెగ

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు ప్రధానికి గోబ్యాక్ ప్లెకార్డులు చూపిస్తున్నది.

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాని మోది శనివారం ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ, ర్యాలీలు, సభల్లో ప్రసంగిస్తున్నారు.

 

పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు ఇండియా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వం బిల్లును జనవరి ఎనిమిదిన లోక్‌సభ ఆమోదించింది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దీనిని నిరసిస్తున్నారు. మేఘాలయ, మిజోరాం, మణిపూర్ ముఖ్యమంత్రులు ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అస్సోంలోనూ పెద్ద ఎత్తున ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోది శుక్రవారం అస్సోం రాజధాని గువాహతికి చేరుకున్నారు. మోది వాహన శ్రేణికి అక్కడ అఖిల అసోం విద్యార్థి సంఘం నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు బయలుదేరగా మరో సారి నిరసన ఎదురైంది. ఆందోళనకారులు నల్లజెండాలు ఊపుతూ పౌరసత్వ విల్లుపై తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. నిరసనల మధ్యే ప్రధాని మోది పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని హూలంగిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి మోది శంకుస్థాపన చేశారు.

ఇటానగర్‌లో దూరదర్శన్ అరుణ ప్రభ ఛానల్‌ను మోదీ ప్రారంభిచనున్నారు. అక్కడ నుండి మళ్లీ గువాహతికి చేరుకుని బ్రహ్మపుత్ర నదిపై ఆరు లైన్‌ల వంతెనకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం త్రిపురలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సభల్లో ప్రసంగించనున్నారు.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment