PSPK 27 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబినేషన్ లో ఏ.ఏం.రత్నం ఓ పీరియాడికల్ అంశంపై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా జరుగుతుంది.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ PSPK 27వ సినిమా అప్డేట్ వచ్చేసింది. క్రిష్ స్టైల్ లో ఒక కీలక కథాంశాన్ని ఎంచుకుని, కొన్ని చారిత్రక అంశాలతో.. భారీ యాక్షన్ సన్నివేశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమాలో 17 వ దశాబ్దం కి సంబందించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ – క్రిష్ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. డైరెక్టర్ క్రిష్ ఇటువంటి సినిమాలను తెరకెక్కించడంతో సిద్ధహస్తుడు. బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి, దగ్గుబాటి రానాతో కృష్ణం వందే జగద్గురుమ్ అంటే సినిమాలతో క్రిష్ ఇప్పటికే నిరూపించుకున్నారు. సో.. ఇప్పుడు టాప్ హీరో పవన్ కళ్యాణ్ తో ఇటువంటి కథాంశం అంటే గూస్బంప్స్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమా లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లు తీస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాకెల్విన్ ఫెర్నాండెజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.