సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా మారథాన్ ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది. 373 బంతులు ఆడిన పుజారా 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేవలం 7 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో వైపు రిషభ్ పంత్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
లంచ్ విరామ సమయానికి 389/5 తో ఉన్న భారత్ లంచ్ విరామం తరువాత కొద్ది సేపటికే పుజారా వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 429 పరుగులు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఇప్పటికే సిరీస్ లో2-1 ఆధిక్యతతో ఉన్న టీమ్ ఇండియా తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ కైవసం చేసుకునే అవకాశాలను సృష్టించుకుంది. బ్యాటింగ్ కు,బౌలింగ్ కు సమానంగా అనుకూలించే సిడ్నీ పిచ్ పై మూడో రోజు నుంచి ఇ బంతి స్పిన్ అవుతుందన్న అంచానాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడం కష్టమేనని కామెంటేటర్స్ చెబుతున్నారు.