ఢిల్లీ, జనవరి1: ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూరైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు పూర్తయ్యే వరకు హైకోర్టు విభజన తాత్కాతికంగా వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలుత అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్ధనను తిరస్కరించిన సుప్రీం కోర్టు బుధవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల వాదనను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే రెండు హైకోర్టులు ఏర్పాటు అయ్యాయి కాబట్టి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.