పంజాబ్ తరన్ తారన్ లోని శ్రీ దర్భార్ సాహిబ్ గురుద్వారా లో శుక్రవారం బాంబు కలకలం రేగింది. గురుద్వారాలోని వెహికల్ స్టాండ్ ప్రాంతంలో లైవ్ బాంబ్ ఒకటి కనుగొనడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా బాంబు కనిపించడంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు, బాంబు స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం లైవ్ బాంబును నిర్వీర్యం చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఇంకెక్కడైనా బాంబులు ఉన్నాయా అన్న అనుమానంతో మొత్తం తనిఖీ చేశారు. వాహనాల స్టాండ్ వద్దకు బాంబును ఎవరు తీసుకువచ్చి అమర్చారు అనే విషయంపై సిబ్బందిని పోలీసులు ఆరా తీస్తున్నారు. లైవ్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.
గోద్రా రైలు దహనం కేసులో 8 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఇది రీజన్