కరోనా కారణంగా వీరామం తీసుకున్న సినీ దర్శక, నిర్మాతలు అన్లాక్ ప్రక్రియ మొదలు కావడంతో… సెట్స్ మీదకు సినిమాలను తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు వారు వారు నటిస్తున్న సినిమాలన్నీ.. ప్రస్తుతం పునఃప్రారంభమయ్యాయి. తారలంతా సినిమా షూటింగుల్లో బిజీ అయ్యారు. కానీ టాలీవుడ్ రౌడీ బాయ్, అమ్మాయిల దిల్ కా ధడకన్… విజయ్ దేవరకొండ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో…తన టాలెంట్తో అమ్మాయిల మనస్సును కొల్లగొట్టిన విజయ్ ఫైటర్ మూవీతో బాలీవుడ్లో పాగా వేసేందు సిద్ధమయ్యాడు.
విజయ్ దేవరకొండ హీరోగా..అనన్య పాండే హీరోయిన్గా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. కరోనా కంటే ముందే 30 శాతం వరకు షూటింగ్ను పూర్తిచేశాడు దర్శకుడు పూరీ. బడా హీరోలు సైతం కరోనా నిబంధనలు పాటిస్తూ…షూటింగుల్లో పాల్గొటుంటే…విజయ్ సినిమా మాత్రం ఇంకా సెట్స్ మీదకు చేరకపోవడంతో అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. మొదట డిసెంబర్ మొదటి వారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని అంతా భావించినా….ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో..విజయ్ ఫాన్స్ తెగ ఫీలవుతున్నారు.
దీంతో ఈ డిసెంబర్లోనూ షూటింగ్ లేనట్లేనని దిగాలు పడుతున్నారు. కానీ సినిమాను జనవరి రెండో వారంలో ప్రారంభించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకే పూరీ ఇటీవల ముమీ వెళ్ళి వచ్చాడట. ఇక ఈ సినిమా డిలే అవడానికి కారణం సినిమాలో కొన్ని సీన్స్ను స్పెషల్గా విదేశీ ఫైటర్స్ తో తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా వారు ఇండియాకు వచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే సినిమా షూటింగ్ వాయిదా పడుతోందంటూ..యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి పూరి స్పీడ్ కి కరోనా ఇలా బ్రేక్ వేసింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!