Puri jagannadh : పూరిజగన్నాథ్ టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. విభిన్న కోణాలలో ట్రెండుకు తగ్గట్టుగా కథలను తెర మీద చూపించడంలో పూరి స్టైల్ ఇంకెవరికీ రాదు. ఆయనని ఫాలో అవగలరేమో గాని ఆయన మేకింగ్ స్టైల్ లో మాత్రం సినిమా తీసే దర్శకుడు ఇప్పటి వరకు లేడనే చెప్పాలి. అలాగే ఆయన హీరో హీరోయిన్స్ ని ఎంచుకునే విషయంలో కూడా కథ కి తగ్గట్టు కాంప్రమైజ్ కాకుండా ఎంచుకుంటాడు. అలాంటి క్రేజీ కాంబినేషన్ మన పూరి జగన్నాధ్ – రవితేజ లది అని అందరికీ తెలిసిందే.
గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు దర్శకుడిగా పూరికి హీరో గా రవితేజ కి మంచి పేరుని తెచ్చి పెట్టాయి. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనింతే, దేవుడు చేసిన మనుషులు ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దేవుడు చేసిన మనుషులు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కాగా ఓ లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతోందని సమాచారం.
Puri jagannadh : మాస్ మహారాజా ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
రీసెంట్ గా క్రాక్ సినిమా విడుదలై రవితేజ ఉత్సాహన్ని మరింత పెంచింది. అదే జోష్ తో ఖిలాడి సినిమా షూటింగ్ ని త్వరగా కానిచ్చేసి పూరి సినిమాతో ట్రాక్ ఎక్కాలని మన మాస్ మహారాజ రవితేజ ఆలోచన అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. ఇటు పూరి కూడా విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ని తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఇన్ని నెలలకి ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. అయితే పూరి లైగర్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాని రవితేజ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. లాక్ డౌన్ లో రాసిన కథ రవితేజ కి పక్కాగా సూటవుతుందని .. ఇప్పటికే ఆ కథ విని రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చేది నిజమా కాదా తెలియదు గాని మాస్ మహారాజా ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తెలిసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు.