Puri jagannaadh : పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో అందరికి తెల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా తీసి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన పూరి కెరీర్ ప్రారంభంలో వరసగా భారీ హిట్స్ అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ హీరోలని మాస్ యాంగిల్ లో చూపించడం తన తర్వాతే ఏ దర్శకుడైనా అని పేరు సంపాదించుకున్నాడు. హీరో ఎవరైనా .. ఆ హీరో మీద తన మార్క్ ఉండాల్సిందే. అంతక ముందు వరస ఫ్లాపులతో ఉన్న పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకుని కం బ్యాక్ అయ్యాడు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ .. విజయ్ దేవరకొండ తో లైగర్ అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గా రమ్యకృష్ణ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే టాలీవుడ్ లో ఉన్న ప్రతీ హీరో పూరి తో సినిమా చేసేది మాస్ ఇమేజ్ కోసమే. అలాంటి మాస్ ఇమేజ్ కొడుకు ఆకాష్ కి ఇవ్వగలడా.. అన్న మాట వినిపిస్తోంది. ఆకాష్ ని హీరోగా చేస్తు మెహబూబా సినిమా తెరకెక్కించాడు పూరి.
Puri jagannaadh : పూరి జగన్నాధ్ కొడుకు కి అదే మాస్ ఇమేజ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడట.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. ఇక పూరి కథ తో అనిల్ పాదూరి దర్శకుడిగా ఆకాష్ రొమాంటిక్ అన్న సినిమాలో నటించాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. కాగా ఆకాష్ నటించే మూడవ సినిమా చోర్ బజార్ అన్న టైటిల్ తో తెరకెక్కబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభం అయింది. అయితే అందరి హీరోలకి మాస్ ఇమేజ్ ఇచ్చే పూరి కొడుకుకి అదే మాస్ ఇమేజ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడట. పక్కా మాస్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆకాష్ ఆ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోగలడా లేదా చూడాలి.