Puri Jagannath: ప్రస్తుతం చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు సినిమా స్క్రిప్ట్ లు రాసుకుంటున్నారు. బాహుబలి పుణ్యమా సౌత్ ఇండియా సినిమాలకు అదే రీతిలో డైరెక్టర్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు పడుతున్న టాప్ హీరోలు సైతం.. మళ్లీ హిట్ కొట్టడానికి సౌతిండియా సినిమాలను రీమేక్ లు చేసుకుంటూ మళ్లీ హిట్ ట్రాక్ లో పడుతున్నారు.
ఇదిలా ఉంటే రీమేక్ చేయాలని హీరోలు షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళు.. ఏకంగా సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. అదే రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థలు సౌతిండియా డైరెక్టర్లను లైన్ లో పెట్టి.. సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో “లైగర్” అనే సినిమా చేస్తున్నారు.
Read more: Puri Jagannath: 2030 సంవత్సరంలో ప్రపంచంలో ఓ వింత జరుగుతుంది అంటున్న డైరెక్టర్ పూరి..!!
ఈ సినిమా తర్వాత తమిళ టాప్ హీరో సూర్య తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పూరి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ తో.. ఈ సినిమాని తెరకెక్కించాలని హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా మాత్రమే కాక చాలా ప్రయోగాత్మకంగా ఉంటుందని.. అందువల్లే సూర్యతో ఈ సినిమా చేయడానికి పూరి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య కి సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ ఉండటంతో .. పూరి జగన్నాథ్ సౌత్లో అనేక భాషల్లో తెరకెక్కించడం మాత్రమే దాక హిందీలో కూడా తెరకెక్కించి బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?