టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీరే వేరు. రోజుల్లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఊహించని రీతిలో తన సినిమాలో హీరోకి మాస్ ఎలివేషన్ క్యారెక్టర్లు ఇస్తూ సరికొత్త ఇమేజ్ వచ్చే రీతిలో స్క్రిప్టు రాసి.. తన మార్క్ డైలాగులతో సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాడు. అటువంటి పూరిజగన్నాథ్ తాజాగా 2020 సంవత్సరం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన యూట్యూబ్ చానల్లో పూరి మూసింగ్స్ అంటూ అనేక విషయాలు గురించి తెలియజేస్తూ.. తాజాగా పాత ఏడాది 2020 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అందరూ తిట్టుకున్నారు కానీ నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం అని తెలిపాడు. 2020 చాలా విలువైన విషయాలు తెలిపిందని హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవటం జరిగిందని, అదేవిధంగా ఇమ్యూనిటీ మరియు ఫుడ్ విషయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకున్నట్లు పూరీ చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా జీవితంలో శుభ్రం అనేది చాలా ముఖ్యం అని హ్యాండ్ వాష్ జీవితంలో ఈ సంవత్సరంలో చేసినట్లు మరి ఏ సంవత్సరంలో చేయలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాదిలో ఎక్కువగా చెవిలో వినబడింది వైరస్, న్యూట్రేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో కొత్త పేర్లు వినబడ్డాయి అని తెలిపారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎనిమిది నెలలు ఎలా గడిచాయో ఎవరికి అర్థం కావటం లేదు డబ్బు ఉన్నా లేకపోయినా ఎలా బతికామన్నది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న అని తెలిపాడు. అదే సమయంలో నిజమైన స్నేహితుడు ఎవరు తెలిసిందని, లైఫ్లో సేవింగ్స్ ఎంత అవసరమో కూడా నేర్చుకున్నాను అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. అంతమాత్రమే కాకుండా ప్రకృతి చాలా ప్రమాదకరమైందని తెలుసుకున్నానని, ఏ దేవుడు కూడా మనుషులను కాపాడలేడు అనేది 2020 సంవత్సరం తెలిపిందని పేర్కొన్నారు.