డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన డబుల్ ఎనర్జీతో ఒకేసారి రెండు సినిమాలని మొదలు పెట్టాడు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్..యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్’ అన్న వర్కింగ్ టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం త్వరలో చిత్రీకరణ మొదలవబోతుందట. అక్టోబర్ మొదటి వారం నుండి హీరో, హీరోయిన్ల మీద సాంగ్స్ ను షూట్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట. కుదిరితే ఈ లోపు కొన్ని యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా మీద విజయ్ దేవరకొండ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో కూడా విజయ్ కి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు పూరి తన కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు. పూరి అసోసియోట్ అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని కూడా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకు రానున్నాడు. అంతేకాదు లాక్ డౌన్ లో పూరి రాసిన కథ తో ఒక వెబ్ సిరీస్ ని ప్రారంభించబోతున్నట్టు తాజా సమాచారం.