Pushpa : అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాకోసం అల్లుఅర్జున్ ఎంతో శ్రమించి తన శరీరాకృతిని మార్చుకున్నాడు. మనం లుక్ లోనే ఆ తేడా చూశాం. తాజాగా రంపచోడవరం లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్… తర్వాతి షెడ్యూల్ కేరళలో పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమా కి సోషల్ మీడియాలో వస్తున్న హైప్, పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రస్తావించారు. అల్లుఅర్జున్ యాక్టింగ్ కి ఈ సినిమాలో మరో లెవెల్ అని చెప్తున్నారు. అంతేకాకుండా సుకుమార్ విజ కూడా అద్దిరిపోయిందని…. ఒక సీన్ గురించి ప్రస్తావించారు.
ఒక సీన్లో దాదాపు 500 మంది కొండపైన ఉంటారని ఆ షాట్ అయితే అద్దిరిపోతుందని దేవిశ్రీప్రసాద్ చెప్పారు. కొండపైకి దారి లేకపోగా వీరీ ఆ కొండను చీల్చి… లారీల్లో జనాలను తోసుకెళ్ళి పైన పెడితే కింద నుండి కెమెరా లో యాంగిల్ షాట్ తీసినట్లు చెప్పారు. అది కూడా లైటింగ్ సరిగ్గా లేని సమయంలో చేయడం విశేషం.
ఇక రాత్రిపూట మంచి చేజింగ్ సన్నివేశాలను అదిరిపోయేలా షూటింగ్ చేస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ టెక్నికల్ వర్క్ చేస్తోంది. ముఖ్యంగా కొండపైన 500 మంది ఉండే షాట్ చూసిన ప్రొడ్యూసర్లు ప్రేక్షకుల్లా తాము కూడా సినిమా విడుదల అయ్యేందుకు వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంతైనా సుకుమార్ తనదైన శైలిలో ఈ చిత్రం మొత్తాన్ని భిన్నంగా తెరకెక్కించేందుకు విపరీతంగా పాటు పడుతున్నట్లు అర్థమైంది.