స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన కూడా చాలా పాపులర్ నటుడు. గత సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా సర్చ్ చేసిన దక్షిణ భారతదేశ నటుడు కూడా అల్లు అర్జున్ కావడం గమనార్హం. ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’ రాజ్ గా భారత దేశం మొత్తాన్ని షేక్ చేసేలా రెడీ అవుతున్నాడు. ముందు ఈ సినిమా ను ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
రష్మిక మందన అల్లు అర్జున్ కి సరసన నటిస్తున్న ఈ చిత్రం మొదట్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల ఉంటుందని టైటిల్ టీజర్ లో ప్రకటించారు. అయితే ఇప్పుడు పెరిగిన అల్లు అర్జున్ రేంజ్, సినిమా పై ఉన్న అంచనాలకు అనుగుణంగా దాదాపు పది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయం కూడా యూనిట్ అంతా కలిసి ఆలోచించి ఒకటిగా తీసుకున్నారని చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాదు అని అందరూ అంటున్నారు.
రెడ్ శాండిల్ ఈ నేపథ్యంలో అడవి లో జరిగే పోరాట సన్నివేశాలు, ఇక పోలీసుల వద్ద జరిగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను సుకుమార్ చాలా బలంగా రాసుకున్నాడట. పది భాషల్లో సినిమాలను విడుదల చేయడమే కాకుండా సినిమా పూర్తయ్యే సరికి మరిన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారు అని కూడా అంటున్నారు. మన తెలుగు సినిమాలకు ప్రపంచ దేశాల్లో ఉండే మార్కెట్ తో నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఇన్ని భాషల్లో ఒక తెలుగు చిత్రం ఏది డైరెక్టర్ గా రిలీజ్ కాలేదు. ఇండియా లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సినిమా కూడా ఇన్ని భాషల్లో ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే అల్లు అర్జున్ సినిమాను ఏకంగా 10 భాషల్లో డైరెక్టర్ రిలీజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఈ సినిమాను ఈ సంవత్సరం వేసవిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ‘పుష్పరాజ్’ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో వేచి చూడాలి.