Pushpa : పుష్ప సినిమా మీద లాక్ డౌన్ కి ముందు ఎన్ని రకాల రూమర్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. సుకుమార్ పక్కా లెక్కతో షూటింగ్ ప్లాన్ చేస్తే కరోనా కారణంగా షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత కథ రిత్యా దట్టమైన అడవుల్లో షూటింగ్ జరిపేందుకు మేకర్స్ చాలా చోట్ల లోకేషన్ ని చూశారు. ముందు అనుకున్న కేరళ లొకేషన్ నుంచి తూర్పుగోదావరి జిల్లా..రంప చోడవరం ప్రాంతం లోని మారేడు మిల్లి పారెస్ట్ లో ఫిక్స్ చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే షూటింగ్ జరుపుతున్నారు. ఎక్కువ భాగం ఫారెస్ట్ లొకేషన్ లోనే షూటింగ్ జరపాల్సి రావడం తో లాంగ్ షెడ్యూల్ ని ఫిక్స్ చేశాడు సుకుమార్.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో పుష్ప తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ తర్వాత మొదలైన ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవడం తో ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ కాకూడదని దాదాపు రోజుకు 14 గంటలు షూటింగ్ జరుపుతున్నారట. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
Pushpa : అనవసరంగా భారీ అంచనాలు పెరిగిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలాయి.
అయితే ఈ మధ్య పుష్ప సినిమా మీద భారీగా అంచనాలు పెంచుతున్నారు. లొకేషన్స్ లో పిక్స్ కూడా లీకవుతున్నాయి. అల్లు అర్జున్ గెటప్ బాగా హైలెట్ అవుతోంది. ఊరమాస్ లుక్ తోనే సినిమా రేంజ్ ని పెంచాడు అల్లు అర్జున్. రీసెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ కూడా మరింత అంచనాలు పెరిగేలా చేసింది. ఇక అభిమానులు కూడా మౌత్ టాక్ తో ఇంకా అంచనాలు పెంచుతున్నారు. అయితే ఇంతగా అంచనాలు పెంచితే కష్టం కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. గతంలో అనవసరంగా భారీ అంచనాలు పెరిగిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఇలాంటి భయాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.