వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితురాలుగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కి మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల టైంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణి ఆ టైంలో టీడీపీ పెట్టిన ప్రలోభాలకు ఎక్కడ తల వంచకుండా వైయస్ జగన్ తోనే నడవటం జరిగింది. గిరిజన నేతగా రాజకీయాల్లో రాణిస్తున్న పుష్పశ్రీవాణి ని వైయస్ జగన్ చాలా సందర్భాలలో తనకు మరో చెల్లి అని సంబోధించడం జరిగింది. అటువంటిది 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పుష్ప శ్రీవాణి కి డిప్యూటీ సీఎంగా పదవి అప్పజెప్పారు జగన్.
కీలక పదవిలో ఉండటంతో పుష్పశ్రీవాణి ఉత్తరాంధ్రలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు భావించారు. కానీ పదవి చేపట్టి ఏడాది అయినా ఆమె వ్యవహారంపై ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరియు సొంత నియోజకవర్గంలో అదేవిధంగా రక్త సంబంధాలు కూడా విమర్శలు చేస్తున్న తరుణంలో వైయస్ జగన్ తో అత్యవసర అప్పాయింట్మెంట్ పుష్ప శ్రీవాణి కోరినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినబడుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను ఆమె సరిగా నిర్వర్తించడం లేదని ప్రతి పనికి తన భర్త పై ఆధార పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తనపై నియోజకవర్గంలో వస్తున్న అసమ్మతిని జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయించడానికి పుష్పశ్రీవాణి నివేదిక రెడీ చేసినట్లు, దాన్ని జగన్ కి చూపించి తనపై నియోజకవర్గంలో వస్తున్నా అసమ్మతిని తొలగించడానికి పుష్ప శ్రీవాణి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?