సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప. ఈ సినిమా ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఇన్ని భాషల్లో అల్లు అర్జున్ సినిమా తెరకెక్కడం ఇదే మొదటిసారి. అంతేకాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ దక్కించుకోబోతున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాని భారీ బడ్కెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు. 2021 లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
కాగ లాక్ డౌన్ తర్వాత మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతంలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే అక్కడ షూటింగ్ ఆపేసి హైదరాబాద్ లో ప్రత్యేంగా ఫారెస్ట్ సెట్ వేసి అక్కడ షూటింగ్ జరపబోతున్నారని తెలుస్తోంది. సినిమాకి ఈ ఫారెస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరించే సీన్స్ చాలా ఇంపార్టెంట్ అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. అందుకే ముందు ఈ సీన్స్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా పుష్ప సినిమాకి సంబంధి లొకేషన్ నుంచి రివీల్ అవుతున్న ఫొటోస్ పుష్ప టీమ్ ని టెన్షన్ పెడుతున్నాయి.
ఇదే ఒక సమస్య అయితే ఇప్పుడు మరో న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఉన్న ఒక సాంగ్ ని సుకుమార్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఆ సాంగ్ కోసం కాశీ వెళ్ళబోతున్నారని వార్తలు వచ్చాయి. కాగా అది కేవలం పుకారే అని యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారట. ప్రస్తుతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మేయిన్స్ సీన్స్ ని కంప్లీట్ చేసే వరకు షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదని సుకుమార్ టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చినట్టు సమాచారం. మొత్తానికి పుష్ప విషయంలో వస్తున్న రూమర్స్ కి మేకర్స్ బాగానే స్పందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?