Bigg Boss 5 Telugu: “గెలవాలంటే తగ్గాలి” అనే కెప్టెన్సీ కం టెండర్ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో పెట్టడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ఈ టాస్క్ స్టార్ట్ కాకముందు.. ఇంటి సభ్యుల బరువు కోలవడం జరిగింది. ఎవరి బరువు తగ్గుతుందో వారే.. బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అవుతారని… నిన్న టాస్క్ ఇచ్చి ఇంటిలో ఫుడ్ ఐటమ్స్ మొత్తం… బిగ్బాస్ తీసుకెళ్ళి పోవడం జరిగింది. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు.. ఆకలికి తట్టుకోలేక.. నానా పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. హౌస్లో ఆకలికి తట్టుకోలేక లోబో ఏకంగా చెత్తబుట్ట వద్దకు వెళ్లి.. ఫుడ్ ఐటమ్స్ వెతుక్కోవడం జరిగింది. దీంతో మంచి ఆకలి మీద ఉన్న ఇంటి సభ్యులకు.. బరువు పెరిగే ఫుడ్ ఐటమ్స్.. హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్.
ఈ క్రమంలో కంటెస్టెంట్ లు చాలావరకు టేస్టీ వంటకాలకు… సరెండర్ అయిపోయారు. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ లో అన్నం ముద్దపప్పు పంపించిన సమయంలో విశ్వ.. తినడం జరిగింది. అయితే ఈ రోజు బిగ్ బాస్ మటన్ బిర్యానీ హౌస్ లోకి పంపించడంతో.. ఇంటిలో మంచి ఆకలి మీద ఉన్న కొంతమంది సభ్యులు బిర్యానీ ఓ పట్టు పట్టారు.
ఏది ఏమైనా కడుపు మాడుస్తూ బిగ్బాస్ లో ఉన్న ఇంటి సభ్యులకు.. బిర్యానీ పెట్టి మరి ఓడిస్తున్నరని తాజా ఎపిసోడ్ లు.. చూస్తున్న వారు అంటున్నారు. మరి ఇంటిలో ఉన్న సభ్యులను కడుపు మార్చటం దారుణమని కూడా వాళ్ల పరిస్థితి ప్రోమోలో చూసినవాళ్లు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు.
కమలహాసన్ ఆకలి రాజ్యం..
ఏది ఏమైనా 17 మంది సభ్యులలో.. చాలా వరకూ తిండిని ఆపుకోలేని వాళ్లు ఎక్కువగా ఉన్నట్లు.. తాజా ఎపిసోడ్ చూసినవాళ్లు చెప్పుకొస్తున్నారు. మరోపక్క సెలబ్రిటీలు గా చలామణి అయిన వీళ్లంతా… ఆకలికి కూడా తట్టుకోలేకపోతున్నరు.. అంటూ వాళ్లు హౌస్లో వ్యవహరించిన తీరుపై.. జనాలు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా లోబో.. హౌస్ లో వ్యవహరించిన తీరు.. కమలహాసన్ ఆకలి రాజ్యం సినిమానీ.. గుర్తు చేసినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే లోబో… నామినేషన్ లో ఉన్న నేపథ్యంలో సింపతి సంపాదించుకోవడానికి.. ఆడుతున్న గేమ్ అని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గెలవాలంటే తగ్గాలి అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్.. ఆడుతున్న ఇంటిలో ఉన్న సభ్యులకు చుక్కలు కనబడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?