Tokyo Olympics 2021: అంతర్జాతీయ టోక్యో ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన్న సంగతి తెలిసిందే. దీంతో సెమీ ఫైనల్ కి చేరుకున్న పివి సింధు.. వరల్డ్ నెంబర్ వన్ తైజు యింగ్ తో తలపడి ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చిన పి.వి.సింధు ఆ తర్వాత.. చాలా వరకు పట్టు కోల్పోయి.. మొదటి రౌండులో తైజు యింగ్ తో 21-18 తో ప్రారంభంలోనే వెనకబడిపోయింది.
ఆ తర్వాత కూడా పీవీ సింధు పెద్దగా పుంజుకోలేదు. దీంతో టోక్యో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్ నెంబర్ వన్ తైజు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. సింధు ఓటమి పట్ల దేశ ప్రజలతో పాటు తెలుగు ప్రజలు కూడా ఎంతగానో నిరాశ చెందారు.ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ లోనే టఫ్ ఫైట్ గా నిలిచిన ఈ గేమ్ లో పీవీ సింధు చిరకాల స్వప్నం ఒలంపిక్స్ మెడల్ రెండు అడుగుల్లో ఓడిపోవడం.. కోల్పోవడం అంతర్జాతీయ క్రీడా రంగంలో సంచలనం సృష్టించింది.
సెమీ ఫైనల్లో పీవీ సింధు పై గెలిచిన తైజు యింగ్ తో ఇప్పటివరకు ఇద్దరు హెడ్ టూ హెడ్ 18 సార్లు తలపడగా.. కేవలం 5 సార్లు మాత్రమే సింధు విజయం సాధించడం జరిగింది. రికార్డుల పరంగా చూసుకుంటే మొట్టమొదటి నుండి తైజు యింగ్ దే అప్పర్ హ్యాండ్. దీంతో ఎన్నో అంచనాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో సింధు ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చినా గాని తర్వాత..పీవీ సింధు పెద్దగా రాణించలేక పోయింది. చివరాకరికి ఓటమిపాలైంది.