భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది సింధు మరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకంది. ఆదివారం ఉదయం జరిగిన టైటిల్ పోరులో చైనా కు చెందిన వాంగ్ జీని 21-09, 11-21 – 21-15 స్కోర్ తేడాతో విజేతగా నిలిచింది. మొదటి గేమ్ లో సింధు ముందు వాంగ్ జీ ఏ మాత్రం నిలవలేకపోయింది. రెండో గేమ్ లో మాత్రం వాంగ్ జీ సింధుకు చుక్కలు చూపించింది. పాయింట్ సంపాదించుకోవడానికే సింధు చాలా కష్టపడాల్సి వచ్చింది. సింధు పుంజుకునే సమయానికి సెకండ్ గేమ్ ను వాంగా జీ సొంతం చేసుకుంది. ఇక మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే మూడో గేమ్ లో సింధు తన శక్తినంతా కూడదీసుకుని తన ప్రత్యర్ధి ఏ మాత్రం కోలుకోకుండా దుకుడుగా ఆడి 21- 15 స్కోర్ తో టైటిల్ ను సొంతం చేసుకుంది.
ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిళ్లు గెలుచుకున్న పీవీ సింధు తాజాాగా సింగపూర్ ఓపెన్ టైటిల్ తో కలిపి మొత్తం మూడు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. మొన్న క్వార్టర్స్ కు చేరిన సింధు.. సెమీస్ ను ఈజీగానే గెలిచింది.