విజయవాడ నుండి 2019 ఎన్నికలలో వైసీపీ పార్లమెంటు కి పోటీ చేసిన వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పీవీపీ అనుచరులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో తన నివాసాన్ని కబ్జా చేసినట్లు కైలాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రెండు సంవత్సరాల క్రితమే ఆ ఇంటిని కొన్నట్లు…ఇప్పుడు ఇంటిని మరమ్మతులు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పొట్లూరి వర ప్రసాద్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకున్నట్లు కైలాష్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఏపీ మీడియా సర్కిల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో బుధవారం పొట్టూరి వరప్రసాద్ కైలాష్ ఇంటి దగ్గరికి వచ్చి తన అనుచరులతో తనపై దాడి చేశారని తాజాగా పోలీసులకు కైలాష్ ఫిర్యాదు చేశారు.దీంతో ఇరు వర్గాలను పిలిచి విచారణ చేపట్టిన తరుణంలో తన దగ్గర భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి అంటూ పీవీపీ చెప్పుకొచ్చాడు. ఆతర్వాత బాధితుడు కైలాష్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన ఏమన్నారంటే…‘‘రూఫ్ టాప్ గార్డెన్ కడితే కూల్చేస్తానని పీవీపీ వార్నింగ్ ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితమే ఇంటిని కొనుగోలు చేశాం. ఇటీవలే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలల నుండి ఫోనులో బెదిరిస్తున్నారు. మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడం తో.. బుధవారం ఉదయం 40 మందితో ఇంటిలోకి దౌర్జన్యంగా వచ్చి… ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. ఆయన ఇల్లు మా ఇంటి వెనుక ఉంటుంది. ఆయన ఇల్లు సరిగా కనిపించదని పీవీపీ అంటున్నారు’’ అని వాపోయాడు. ఇంత దౌర్జన్యం గా వ్యవహరిస్తున్న పొట్లూరి వరప్రసాద్ విషయంలో పోలీసులు అరెస్టు చేస్తారా లేకపోతే ఈ విషయాన్ని సెటిల్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.
previous post