ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు విషయంలో ఆర్ నారాయణ మూర్తి మొదటి నుండి ప్రశంసిస్తూనే ఉన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో.. అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇంటి వద్దకు చేర్చే విషయంలో ఆర్ నారాయణ మూర్తి శభాష్ అన్న రీతిలో జగన్ సర్కార్ పై పొగడ్తల వర్షం అప్పట్లో కురిపించారు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకత యూనివర్సిటీలో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక మరియు తదితర అంశాలపై సినిమా చేస్తా అని తాజాగా నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ఈ టైపులో సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు. ఇటీవల ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులతో ఆర్.నారాయణమూర్తి చెప్పడం జరిగింది.
తన సినిమాలలో సామాజిక అంశాలతోపాటు సందేశాత్మక కంటెంట్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అందువల్లే ఈ సినిమా స్టార్ట్ చేయటంలో చాలా లేట్ అయిందని, వచ్చే ఏడాది లో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖపట్టణంలో అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు.