ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాధే శ్యామ్. బాహుబలి, సాహో లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల తర్వాత వస్తున్న పీరియాడికల్ వింటేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. తెలుగుతో పాటు అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియోషన్స్ పతాకలపై ప్రశీద – వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభం అయినప్పుడే ప్రభాస్ చెల్లి ప్రశీద కి భారీ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చాడట ప్రభాస్. కృష్ణం రాజు కూతురైన ప్రశీద ఇన్నాళ్ళు యువి క్రియోషన్స్ లో సినిమా నిర్మాణానికి సంబంధించిన పనులన్ని చూసుకుంది. ఇప్పుడు రాధే శ్యామ్ తో నిర్మాణంలో భాగస్వామిగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ మొదలవబోతుంది.
కాగా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీదే ఇలాంటి సినిమా చూడని విధంగా దర్శకుడు రాధకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడట. విక్రమాదిత్య గా ప్రభాస్ ప్రేరణ గా పూజా హెగ్డే ప్రేక్షకులని కొత్త ఊహల్లోకి తీసుకు వెళతారని యూనిట్ చెప్పుకుంటున్నారట. అంతేకాదు ప్రభాస్ కెరీర్ లోనే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదని తెలుస్తుంది.
ఇక రాధే శ్యామ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఒకెత్తైతే ఇప్పటి నుంచి వచ్చే అప్డేట్స్ ప్రభాస్ అభిమానులను .. ప్రేక్షకులను ఉత్సాహపరుస్తాయని.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అన్న క్యూరియాసిటీ పెంచుతాయని చెబుతున్నారు. అంటే ఇక పి వరుస గా రాధే శ్యామ్ నుంచి సర్ప్రైజెస్ వస్తూనే ఉంటాయని తెలుస్తోంది.