Radhe Shyam: బాహుబలి(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో(Sahoo) సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ప్రభాస్(Prabhas) నటిస్తున్న రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. “సాహో” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా… మధ్యలో కరోనా రావటంతో పాటు సినిమాకి సంబంధించి అప్డేట్ చాలా లేట్ గా వస్తూ ఉండటంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా నిర్మాతలపై మండిపడుతూ ఉన్నారు.
ఈ క్రమంలో ఇటీవల సినిమా నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ ఒకరు.. సినిమా అప్ డేట్ రిలీజ్ చేయకపోతే.. సూసైడ్ చేసుకుంటా అని లెటర్ రాయడం తో.. నవంబర్ 15 వ తారీకు.. సాయంత్రం సినిమాకి సంబంధించి చిన్న పార్టీ పాట కలిగిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ తరుణంలో రాధేశ్యామ్ స్టోరీ పాట రూపంలో చెప్పారు అని చాలా మంది నెటిజన్లు స్టోరీ ఇదే అంటూ సరికొత్త వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే ఈ సినిమా ఇటలీ(Italy) దేశంలో ఒక ప్రముఖ రైలుకి సంబంధించిందని చెప్పుకొస్తున్నారు. గోస్ట్ ట్రైన్ అనే రైల్ 1911 లో.. ప్రమాదానికి గురైన క్రమంలో 106 మంది ప్రయాణికులు మరణించడం జరిగింది.
“జనీతి”(Zaneeti) అనే పేరు ఆ రైల్ కి ఉండేదట.. దానిని ఆధారం చేసుకునే..”రాధేశ్యామ్”(Radhe Shyam) సినిమా చేయడం జరిగింది..అని, టైంలైన్ ఆధారంగా.. చాలా ట్విస్ట్ లతో.. సినిమా స్టోరీ ఉంటుందని.. అర్బన్ ప్రేక్షకులకు మాత్రమే కాక అన్ని రకాల సినిమా ప్రేక్షకులను అలరించే సినిమా “రాధేశ్యామ్” అని.. లేటెస్ట్ గా ఈ సినిమా స్టోరీ సోషల్ మీడియాలో రావటం జరిగింది. చాలా కన్ఫ్యూజ్ గా… రకరకాల ట్విస్టులతో సినిమా ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా నేపథ్యం లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులముందుకురానుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?