Radhe Shyam : ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య గా కనిపించనున్నాడు. జూలై 30వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ పెరిగిపోయింది. ఇండియా లోనే అతి పెద్ద స్టార్ అయిన ప్రభాస్ సినిమాలకు కూడా భారీ రేంజ్ లో బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయిపోయారు. ప్రభాస్ తో చేస్తున్న సినిమాకి బడ్జెట్ లో ఎలాంటి కోతలు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ తో నే ఈ విషయం అర్థం అయిపోయింది.
ఇక ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఏమిటంటే…. ఈ సినిమాలో ప్రభాస్ వేసుకున్న బట్టల కోసమే దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట నిర్మాతలు. అంతే కాకుండా ఈ చిత్రం ఒక పిరియాడిక్ ఫిలిం కావడంతో పాత్రధారులు వేషధారణ విషయంలో చాలా రీసెర్చ్ చేసి కేవలం ప్రభాస్ దుస్తుల కోసమే ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.
అయితే మిగిలిన వారి బట్టల కోసం మరింత అయి ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ తో పాటుగా గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!