Radhe shyam: పాన్ ఇండియన్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత కమిటయిన పాన్ ఇండియన్ సినిమాలలో రాధే శ్యామ్ ఒకటి. ఇప్పటి వరకు ప్రభాస్ తన కెరీర్లో చేయనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాను చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈశ్వర్ సినిమా నుంచి సాహో వరకు ఏ దర్శకుడు చూపించని ఓ సరికొత్త క్యారెక్టర్లో ప్రభాస్ను చూపించబోతున్నాడు. పామిస్ట్( హస్త సాముద్రికుడు )గా ప్రభాస్ పాత్ర ఉండబోతోందని ఇటీవల విడుదల చేసిన పాత్రతో హింట్ ఇచ్చాడు దర్శకుడు. టైటిల్ పోస్టర్ నుంచి సెకండ్ టీజర్ వరకు రాధే శ్యామ్ కి సంబంధించి అందరిలో ఉన్న ఆలోచనలు వేరు.
ఎప్పుడైతే పామిస్ట్గా ప్రభాస్ రోల్ ఉంటుందని తెలిసిందో ప్రతీ ఒక్కరిలో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. ఇలాంటి లవ్ స్టోరి కూడా ఇన్నేళ్ళలో ఎప్పుడూ చూడలేదని దర్శక నిర్మాతలు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ హైలెట్గా నిలవనున్నాయి. కథలో ప్రతీ ఒక్కరు లీనమయ్యేలా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేయనుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు మనన్ భరద్వాజ్, కోలీవుడ్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ మిగతా సౌత్ భాషలకు సంగీతం అందిస్తున్నాడు.
Radhe shyam: అదే ‘రాధే శ్యామ్’ సినిమాలో మేయిన్ పాయింట్
ఇది కూడా రాధే శ్యామ్ సినిమాకు ప్రత్యేకత. విజువల్ వండర్గా రూపొందుతున్న ఇందులో పూజా హెగ్డే భవిష్యత్తు ఏమిటో ప్రభాస్కు తెలుస్తుందట. అదే సినిమాలో మేయిన్ పాయింట్ అని దానీ అధారంగానే స్క్రీన్ ప్లే సాగుతుందని సమాచారం. ఇక ఇలాంటి కథలు హాలీవుడ్లో హై టెక్నికల్ వ్యాల్యూస్తో రూపొందుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి అన్నీ హై రేంజ్ ఎలిమెంట్స్తోనే యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో రాధే శ్యామ్ సినిమాను నిర్మిస్తున్నారు. 2022, జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా 7 భాషలలో రాధే శ్యామ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రంగస్థలం సినిమా లాంటి మాసీ ఎంటర్టైనర్స్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఫిక్సై ఉన్నారు. రాధే శ్యామ్ రిలీజ్ తర్వాత అందరి హీరోల ఆలోచన మారడం ఖాయమని తెలుస్తోంది.