Radhe shyam: కొందరు హీరోలు సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ వెర్షన్ కాపీ చూసి కొన్ని కీలక మార్పులు.. చేర్పులు సూచిస్తుంటారు. ఇలా సూచించే హీరోలు మన టాలీవుడ్లో చాలామందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్..
లాంటి వారు ఫస్ట్ కాపీ ఒకటికి రెండుసార్లు సినిమా చూసి రిజల్ట్ ఎలా ఉంటుందో కాస్త ముందుగానే ఓ అంచనాకు వచ్చేస్తారు. కొన్ని సినిమాలు ఒక్క ఫ్రేమ్ కూడా ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. రన్ టైం ఎక్కువైనా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారని అలానే రిలీజ్ చేసేస్తారు.
సినిమాను వీలైనంత ఎక్కువసార్లు చూసిన హీరోలు తమ ఐడియాలజీని చెబుతుంటారు. చాలా వరకు అవి వర్కౌట్ అవుతుంటాయి. ఆ రకంగా సినిమాను దర్శకుడితో పాటు చూసే హీరోలు. ఆ రకంగా సినిమా సక్సెస్లో మన హీరోల ఎనాలసిస్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అదే ఇప్పుడు మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేసినట్టు తాజా సమాచారం.
తాజాగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ వెర్షన్ ప్రభాస్ చూశారట. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడికి కొన్ని కీలక మార్పులు కోరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఇంకా క్రిస్పీగా ఉండేలా ఎడిట్ ప్యాటర్న్లో కొన్ని మార్పులు చేయమన్నారట. అయితే, ప్రభాస్ ఛేంజెస్ ఎక్కడెక్కడ కోరారు? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
Radhe shyam: ప్రభాస్ వల్ల మేకర్ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది?
క్రియేటివిటీ పరంగా ఇటువంటి మార్పులు ఎవరికి ఇబ్బందికరమైనవి ఉండవు. ఎడిటింగ్ టేబుల్ మీద జరిగే మార్పులు కాబట్టి యూనిట్ సభ్యులందరూ ఆమోదిస్తుంటారు. రాధేశ్యామ్ సినిమా రన్ టైం తగ్గించడానికి కూడా వీలైనంత ట్రిమ్ చేయడానికే దర్శక, నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తుంటారు.
అయితే, మేకర్ ఐడియాలజీని హీరోలు క్రాస్ చేసి వెళితేనే సక్సెస్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటివరకూ మెగాస్టార్, అల్లు అర్జున్ కారణంగా ఏ దర్శకుడు ఇలా ఇబ్బంది పడింది లేదు. కానీ, మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ల వల్ల మాత్రం దర్శకులకు చిన్నపాటి గతంలో చిన్నపాటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన సందర్భాలున్నాయి. మరి ప్రభాస్ వల్ల మేకర్ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? అనేది చూడాలి.