Radhe shyam: పలు వాయిదాలు పడిన ప్రభాస్ – పూజా హెగ్డేల రాధే శ్యామ్ ఎట్టకేలకు మార్చ్ 11న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇటీవలే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను గ్రాండ్గా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభాస్ బృందం ఇప్పటి వరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త విధానంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్బులో గ్రాండ్గా నైట్ పార్టీ నిర్వహించబోతున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా వాలెంటైన్స్ నైట్ థీమ్ పార్టీ ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ నైట్ థీమ్ పార్టీ ఈవెంట్కు హీరో, హీరోయిన్ ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీ నటులు టెక్నికల్ బృందం పాల్గొనబోతున్నారు. ఇక దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. అత్యంత గ్రాండ్గా ఈ సెట్ను వేస్తున్నారు. సినిమా కథను ప్రతిబింబించేలా కొన్ని స్పెషల్ ఆర్ట్స్ అందరినీ అట్రాక్ట్ చేయబోతున్నాయి. విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే రాధే శ్యామ్ సినిమా కథ. జనవరి 12 నుంచి వాయిదా పడిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Radhe shyam: ఇలాంటి కామెంట్స్ అన్నీ వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు పెంచాయి.
అన్నీ భాషలలోనూ రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెంచేసాయి. రాధే శ్యామ్ సినిమాకు ఆయన నేపథ్య సంగీతం అందించారు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన థమన్..రాధే శ్యామ్ సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక తెలియని ట్రాన్స్ లోకి వెళ్లిపోయానన్నారు. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ప్రేమ కథ చూసిన ఫీలింగ్ నాకు కలిగింది..అని అన్నారు. ఇలాంటి కామెంట్స్ ఇపుడు యూత్ ఆడియన్స్తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు పెంచాయి.