Radhe shyam : రాధేశ్యామ్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధాకృష్ణ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. 1970 కాలం నాటి అద్భుతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. దాదాపు పదేళ్ళ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరి. అదీ కాక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, సాహో లాంటి భారీ యాక్షన్ డ్రామా జోనర్స్ చేసిన తర్వాత రాధేశ్యామ్ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తుండటంతో అంచనాలు అందుకుంటాడా అనే సందేహాలు కూడా కొంతమందిలో ఉన్నాయట.
అందుకు కారణం ఇప్పుడు అందరూ ప్రభాస్ నుంచి హెవీ యాక్షన్ సినిమాలను కోరుకుంటుండటమే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మోషన్ టీజర్, టీజర్ రాధేశ్యామ్ మీద భారీ లెవల్ లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో రాధేశ్యామ్ కథ గురించి కొన్ని రోజులుగా రక రకాల వార్తలు వస్తున్నాయి. అదే విధంగా తాజాగా ఈ సినిమా కథ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడట. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మించారు. ఈ సెట్స్ లోనే దాదాపు సినిమా షూటింగ్ మొత్తం జరిపినట్టు తెలుస్తోంది.
Radhe shyam : కథ గనక నిజంగానే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగితే ప్రేక్షకులు థ్రిల్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ సినిమా కథ గనక నిజంగానే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగితే ప్రేక్షకులు థ్రిల్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఎక్కువగా ప్రభాస్ – పూజా ల మధ్య లవ్ సీన్స్ రన్నింగ్ ట్రైన్ లో చిత్రీకరించినట్టు సమాచారం. ఇలాంటి సినిమా ప్రభాస్ మొదటిసారి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మైల్ స్టోన్ మూవీగా రాధేశ్యామ్ నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిన్న టాకీపార్ట్ తో పాటు ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. కాగా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ చేస్తున్నారు. ఇక ఇటీవలే సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా సెట్స్ మీదకి వచ్చింది.