Prabhas world record: డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ దిమ్మతిరిగే రికార్డును నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది. బాహుబలి 2 లాగా రాధేశ్యామ్ కూడా రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్లలో/ థియేటర్లలో రిలీజ్ కానుందని టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Raj tharun: ఈ ట్రైలర్ ఏదో బాగుందే.. రాజ్ తరుణ్ హిట్ కోట్టేలా ఉన్నాడే ..!
రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కోసం ఉత్తర భారతదేశంలో ఏకంగా 3700 కు పైగా స్క్రీన్లను లాక్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బాహుబలి 2, కరోనా మహమ్మారి తర్వాత ఈ రేంజ్ లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతోన్న సినిమాగా రాధేశ్యామ్ రికార్డ్ సృష్టించబోతోంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు సినిమా ఉత్తర భారతదేశంలో ఈ స్థాయిలో విడుదల అవుతుండటం గమనార్హం. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఇదే స్థాయిలో అత్యధిక స్క్రీన్లను లాక్ చేస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ మరోసారి బద్దలు కావడం ఖాయం.