జగన్ అధికారంలోకి వచ్చి పరిపాలన పరంగా అంతా బాగానే ఉన్నా సొంత పార్టీలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ అటు ప్రత్యర్థులకు అవకాశం గాను ప్రజలలో పార్టీకి నష్టం తెచ్చే లాగా మారింది. ప్రస్తుతం జగన్ పరిపాలన పరంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అందించడం జరిగింది. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు చాలా సర్వేలలో తేలింది. మరోపక్క జాతీయ స్థాయిలో కూడా జగన్ పరిపాలన బాగుందన్న వార్తలు రావడంతో పాటు కేంద్రం కూడా జగన్ నిర్ణయాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. పరిస్థితి ఇలా ఉన్న టైంలో ఎలాగైనా జగన్ ని దెబ్బ కొట్టాలంటే రాష్ట్ర లెవెల్ లో అయ్యే పని కాదని అటు తెలుగుదేశం పార్టీ ఇటు పార్టీలో ఉన్న సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కయ్యం పెట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు జగన్ కి దెబ్బ ఢిల్లీ బీజేపీ పెద్దలు వేస్తేనే అది సరిగ్గా ఉంటుంది అనే భావనతో సొంత పార్టీపై విమర్శలు చేసి సస్పెండ్ అయి బీజేపీలో చేరాలని తెగ ఆరాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నాయకులతో రఘురామకృష్ణంరాజు భేటీ అయినట్లు బీజేపీ లోకి వెళ్ళటానికి లైన్ క్లియర్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.
ఇదిలా ఉండగా రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీ ఫెవర్ చేసిన అభ్యర్థి పరిమళ్ నాత్వానీ ని తన పార్టీ తరపున రాజ్యసభకు జగన్ పంపడంతో జగన్ మీద ఇటీవల కేంద్రానికి మరింత గౌరవం పెరిగినట్లు…సొ రాజుగారి పప్పులు ఉడకలేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. క్షుణ్నంగా విషయంలోకి వెళ్తే రఘురామకృష్ణంరాజు పార్టీలోకి వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని… 2019 ఎన్నికల్లో ఈయన గెలుపు వెనకాల జగన్ వేవ్ ఉండటంతోనే గెలిచినట్లు బీజేపీ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరో పక్క రాష్ట్రంలో జగన్ మీద ప్రజలు సానుకూలంగా ఉండటంతో… ఇటువంటి సమయంలో జగన్ తో వైరం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. సో మొత్తం మీద జగన్ కి దెబేద్దాం అనుకుని కేంద్రం దగ్గర రఘురామకృష్ణంరాజు బ్యాడ్ అయినట్లు సమాచారం. మరోపక్క జిల్లాలో పార్టీ క్యాడర్ కూడా తిరగబడటం తో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ కెరియర్ అటూ ఇటూ కాకుండా డేంజర్ పొజిషన్ లో పడినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.