నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందునుండి పార్టీ తీరు అలా అయితే తన తీరు మరోలా అన్నట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తీసుకునే ప్రతి విషయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వైసీపీకి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లీష్ మీడియం మొదలుకొని మూడు రాజధానుల వరకు ఇంకా చాలా విషయాలు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నిరఘురామకృష్ణంరాజు వ్యతిరేకిస్తూ పార్టీలో రెబెల్ ఎంపీగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా వైయస్ జగన్ పుట్టినరోజు ఈ నెల 21వ తేదీ కావటంతో.. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి సంచలన కామెంట్ చేశారు.
మేటర్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు నేపథ్యంలో కరోనా కష్టకాలంలో వ్యాపారుల దగ్గర నుండి కొంతమంది వైసీపీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపించారు. వ్యాపారుల నుంచి వసూలు చేసే ఈ జే టాక్స్ను ఆపాలని వ్యాఖ్యానించారు. ఇటువంటి దుష్ట శక్తుల నుండి చిరు వ్యాపారులను కాపాడాలని జగన్ ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. మీ పుట్టిన రోజు వేడుకల కోసం సొంత డబ్బు గాని ప్రభుత్వం డబ్బు వాడండి అంతేగానీ వ్యాపారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే ఎవరైతే డబ్బులు చిరువ్యాపారులు దగ్గర నుండి వసూలు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.