వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వివరించారు. తనకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆయన సభాపతిని కోరారు. అన్ని అంశాలను విన్న స్పీకర్.. ఆ విషయాన్ని తన ఓఎస్డీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ముఖ్యంగా ఆయనపై వస్తున్న బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలను స్పీకర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసారు. స్పీకర్ తో ఎంపీ భేటీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. షోకాజ్ నోటీసులు ఇచ్చే అంశంలో పార్టీ, సభ్యుల పరిధిపై చర్చించారు.