ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాసారు. ఐఅండ్పీఆర్లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్రెడ్డి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారంటూ ఆ లేఖలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ప్రభుత్వంలో కీలక శాఖలో ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి ఇలా ఎంపీ స్థాయి వ్యక్తిని కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ లేఖలో ప్రస్తావించారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ చర్యల్లో జాప్యం ఉన్నా, చర్యలు తీసుకోకున్నా తాను పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కాగా ఈ లేఖకు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా ఉంది. ఇటీవలే ఈ రెబెల్ ఎంపీ వరసగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తున్న విషయం తెల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?