గతకొంత కాలంగా యువజనశ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాఘురామకృష్ణం రాజు వ్యవహారం అటు పార్టీలోనూ, ఇటు బయటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక, టీటీడీ భూముల అమ్మకంతో మొదలైన ఈ అసమ్మతి… నేడు హస్తినలో పార్టీ వ్యతిరేక రాజకీయాలు చేసేవరకూ వచ్చిందంటే చిన్న విషయం కాదు! ఈయన విషయం ఇలా పీక్స్ కి వెళ్లడానికి.. ఆర్.ఆర్.ఆర్. కి ఆ హక్కు రావడానికి గల ప్రారంభ కారణాలను జగన్ పునఃసమీక్ష చేసిన అనంతరం.. విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసుతోనే ఇది తీవ్ర రూపం దాల్చిందని తేలిందంటున్నారు!
షోకాజ్ నోటీస్ ఇవ్వమని జగనే చెప్పినప్పటికీ… అధికారికంగా ది యువజనశ్రామికరైతు కాంగ్రెస్ పార్టీ (లీగల్ గా) తరుపున ఉందా లేదా అన్న విషయంలో విజయసాయి మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందనేది ఇప్పుడు వినిపిస్తోన్న కొత్త మాట. అప్పటివరకూ ఒకమాదిరిగా ఉన్న ఈ వ్యవహారం కాస్తా బహిరంగ రచ్చకు చర్చకూ దారితీయడానికి గల కారణాలకు అధికారికంగా అది ఆధ్యం పోసిందనేది కొందరి వాదనగా ఉందంట!
ఆర్.ఆర్.ఆర్. అప్పటికే బలంగా ఫిక్సయిపోయినప్పటికీ… విజయసాయి షోకాజ్ నోటీసులో వచ్చిన అనంతరం అధికారిక ఆయనకు బలం చేకూర్చినట్లవ్వడంతోపాటు… పార్టీ పేరు అనే కొత్త వివాదం తెరపైకి వచ్చిందనేది వారి అభిప్రాయంగా ఉందంట! దీంతో… సాయిరెడ్డి – జగన్ ల మధ్య ఆర్.ఆర్.ఆర్. కొత్త చిచ్చు పెట్టారనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి!